Indo-Pak Talks: హాట్ లైన్లో భారత్-పాక్ చర్చలు ప్రారంభం-మన డిమాండ్లు ఇవే..!
కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారీ నష్టాలు చవిచూసిన పాకిస్తాన్ అనంతరం అమెరికా అధ్యక్షుడి జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే బారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు సై అంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య ఇవాళ కీలక చర్చలకు కూడా అంగీకరించారు. ఈ మేరకు ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు భేటీ అయ్యారు.
భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కషిఫ్ చౌదరి మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో వీరిద్దరూ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే కాశ్మీర్ అంశంపై మాత్రం వీరు చర్చించడం లేదు. వీరి భేటీలో చర్చిస్తున్న అంశాల్లో కశ్మీర్లో చొరబాట్లు, సైనిక కార్యకలాపాల నిలిపిపేత, వైమానిక చొరబాట్లు, సరిహద్దు తీవ్రవాదం వంటివి ఉన్నాయి.
పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పించడం ఆపాలని మన దేశం కోరుతోంది. లాంచ్ ప్యాడ్లను మూసివేయడం,డ్రోన్లు చొరబడకుండా చూడటం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వదలకుండా ఉండటం, డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలను పంపడం మానేయడం వంటివి భారత్ తరఫున డిమాండ్లుగా ఉన్నాయి. వీటికి పాకిస్తాన్ ఏ మేరకు అంగీకరిస్తుందన్న దానిపైనే తదుపరి చర్చలు లేదా యుద్దం వంటి నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అమెరికా జోక్యంతో పాకిస్తాన్ డీజీఎంఏ జనరల్ కషీఫ్ చౌదరి భారత డీజీఎంఏ రాజీవ్ ఘాయ్ తో కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. దీంతో భారత్ కూడా దీనికి ఒప్పుకుంది. దీంతో రెండు రోజుల క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే అదే రోజు పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనిపై భారత్ వెంటనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నిన్న పరిస్దితి పూర్తి ప్రశాంతంగా మారింది. దీంతో ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు చర్చలు జరుపుతున్నారు.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications