‘భారత్లో పేదరికం తక్కువ: పేదలే ఎక్కువ’: డబ్ల్యూబి
వాషింగ్టన్: భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గిపోయిందని, అయితే దేశంలో పేద ప్రజలే ఎక్కువ ఉన్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ క్రమంలో 2012లో చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలలో కన్నా ఇండియాలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు.
మిగతా దేశాలతో పోలిస్తే పేదరికం రేటు బాగా తక్కువ ఉందని ఉద్ఘాటించింది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. పేదరికం రేటు భారత్లో గణనీయంగా తగ్గుతుందని ప్రకటించింది. 2015లో ప్రపంచ జనాభాలో పేదరికం 10శాతం తగ్గిపోయిందని తెలిపింది.
2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ ఎంతో కృషి చేస్తోందని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో పేదరికం రేటు 43 శాతం, మధ్యాదాయ దేశాల్లో 19 శాతం ఉందని పేర్కొంది.
2012లో అల్పాదాయ దేశాలుగా ఉన్న చైనా, భారత్, ఇండోనేషియా, నైజీరియాలు 2015లో దిగువ మధ్యాదాయ దేశాల జాబితాలో చేరాయని వెల్లడించింది. ప్రపంచంలో పేదరికం నిర్మూలన దిశగా అన్ని దేశాలు ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ తెలిపారు.