పాకిస్థాన్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్.. పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్.. పాకిస్థాన్ ఇటీవల IMF నుంచి కోరిన బెయిలౌట్ ప్యాకేజీ కంటే డబుల్ గా ఉందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధిని చూడలేదంటే పాకిస్థాన్ భ్రమల్లో ఉందని, కలల్లో విహరిస్తోందని భారత్ విమర్శించింది. జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొంది. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ఐరాస వేదికగా మరోసారి భారత్ నొక్కి చెప్పింది.
ఈ మేరకు జమ్ముకశ్మీర్ గురించి పాకిస్థాన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) అసత్య ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి 55వ సాధారణ సమావేశ ఉన్నత స్థాయి విభాగంలో భారత్ తరఫున కార్యదర్శి అనుపమ సింగ్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్, OIC చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా భారత్ తన ప్రతీకార హక్కును వినియోగించుకోవడానికి కట్టుబడి ఉంది. ఈ ఆరోపణలను మేము ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాం" అని స్పష్టం చేశారు. "జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగమే" అని పేర్కొన్నారు.
"పాకిస్థాన్ అసత్య ప్రచారం చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేదు. భారత స్వాతంత్ర్య చట్టం 1947, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం పూర్తిగా చట్టబద్ధమైనది" అని సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించి మిగిలి ఉన్న ఏకైక వివాదం పాకిస్థాన్.. భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకోవడమే" అని సింగ్ అన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్ తన నియంత్రణలోని ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. జమ్మూ కాశ్మీర్ మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతిని వివరిస్తూ.. సింగ్ చెనాబ్ రైల్ వంతెనను ప్రస్తావించారు. గతేడాది ప్రారంభించిన అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. "గతేడాది జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్ వంతెన ఫేక్ అయితే.. పాకిస్థాన్ భ్రమల్లో ఉందని అర్థం చేసుకోవాలని ఆమె నొక్కి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్ల పోలింగ్ శాతాన్ని ఆమె ఉదహరించారు. ఈ ప్రాంత ప్రజలు "ఉగ్రవాదం, హింస సిద్ధాంతాలను తిరస్కరించి," అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. పాకిస్థాన్ "నిరంతర రాష్ట్ర-ప్రాయోజిత ఉగ్రవాదం" ద్వారా ఈ ప్రాంతాన్ని అస్థిరపరచాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ రాజకీయ, ఆర్థిక, సామాజిక పురోగతిని సాధిస్తోందని నొక్కి చెప్పారు.

"పాకిస్థాన్ అటువంటి వేదికపై గొప్పలు చెప్పుకుంటూ తన లోతైన అంతర్గత సంక్షోభాన్ని కప్పిపుచ్చే బదులు, దానిని పరిష్కరించడంపై దృష్టి సారిస్తే మంచిది" అని సింగ్ హితవు పలికారు. "ప్రపంచం.. పాక్ కుతంత్రాలను ఖచ్చితంగా గుర్తించగలదు" అని ఆమె బలంగా చెప్పారు. ఐరాస మానవ హక్కుల మండలి వేదికలో జమ్మూ కాశ్మీర్ సమస్యపై భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య పరమైన వాగ్వాదాల తాజాగా కీలక పరిణామంగా మారాయి.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications