సంక్షోభం అంచులో పాకిస్థాన్ .. 12 లక్షల మంది రైతుల వలసలు.. 80 శాతం నీరు కోల్పోయి.. !
భారత్ సరిహద్దు దేశం పాకిస్థాన్ లో సంక్షోభం తలెత్తుతోంది. పాకిస్థాన్ లోని ఇండస్ డెల్టా ప్రాంతంలోకి ఉప్పు నీరు భారీగా చేరడం కారణంగా అక్కడి ప్రజల జీవన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఉప్పు నీరు కారణంగా ఇండస్ డెల్టా ప్రాంతంలో పంటలు పండటం లేదు. చేపల పెంపకం నిలిచిపోవడంతో మత్య్స కార్మికులు తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. ఖారో చాన్ పట్టణం జనాభా 1981 లో 21 వేలు ఉండగా 2023 నాటికి ఆ జనాభా 11 వేలకు తగ్గిపోయింది. సముద్రంలోని నీటిమట్టం పెరగడంతోనే అక్కడి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నట్లు తేలింది. ఇండస్ డెల్టాలో నీరులో లవణీయత 70 శాతం పెరిగింది. దీంతో అక్కడి పంటలు దెబ్బతినడంతో పాటు మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడింది.
“We haven’t just lost our land; we’ve lost our culture.”
— Al Jazeera English (@AJEnglish) August 5, 2025
The slow death of Pakistan’s Indus delta due to encroaching seawater.
— in pictures https://t.co/8OjzzpTXEq pic.twitter.com/3jCOhRfG4k
పాకిస్థాన్ కు దక్షిణభాగంలో సింధూ నది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలోని నీటిలో ఉప్పు శాతం అధికంగా పెరిగిపోయింది. 80 శాతం తాగునీటిలో లవణీయత పెరిగిపోయి తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో తీర ప్రాంతంలో పంటలు, మత్స్య సంపద పూర్తిగా దెబ్బతిన్నది. సింధూ నది.. అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఖారో చాన్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు తాగు నీరు దొరికే పరిస్థితి లేదు. సాగు నీరు కూడా లభ్యం కాదు. మొత్తం ఉప్పు నీరు మాత్రమే. దీంతో ఒకప్పుడు 40 గ్రామాలు ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు.
అలా గత 2 దశాబ్దాలుగా దాదాపు 12 లక్షల మందికి పైగా ప్రజలు సింధూ నది డెల్టా నుంచి వలస వెళ్లిపోయారు. పాకిస్థాన్ లోని దాదాపు 80 శాతం మందికి సింధూ నదే జీవనాధారం. అక్కడి సాగు, తాగు నీటికి ఈ నది ఆధారంగా ఉంది. అయితే సింధూ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో గతంలో వ్యవసాయం, మ్యాన్ గ్రూవ్, మత్య సంపద అధికంగా ఉండేది. కానీ ఉప్పు నీరు పెరగడంతో ఇప్పుడు పూర్తి భిన్నంగా మారింది. ఉప్పు నీరు క్రమంగా విస్తరిస్తున్న కారణంగా దాదాపు 17 శాతానికి పైగా సాగు భూమి ఇప్పుడు సాంద్రత కోల్పోయింది. పంటలు పండటం లేదు. ఈ విషయాన్ని 2019 నాటికి అక్కడి ప్రభుత్వం గుర్తించింది.

మరోవైపు సింధూ నది పరీవాహక ప్రాంతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి కలిసి లివింగ్ ఇండస్ ఇనిషియేటివ్ ను అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా నేల లవణీయతను తగ్గించడం, మడ అడవులను పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ అడవులు ఉప్పునీరు బయటకు వచ్చి ఇతర జలాశయాల్లో కలిసిపోకుండా సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications