ఐసిస్ ముందే హెచ్చరించిందా?: మాంచెస్టర్ ఎటాక్లో వెలుగుచూసిన నిజం!?..
బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది.
మాంచెస్టర్: ఆత్మాహుతి దాడితో ఇంగ్లాండు ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. సంగీతంలో ఓలలాడుతున్న మాంచెస్టర్ ప్రజలు.. ఆత్మాహుతి దాడితో ఒక్కసారి భీతావహులుగా మారిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి ముందస్తు హెచ్చరిక వెలువడినట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండులో సంగీత కచేరీపై ఆత్మాహుతి దాడి: 22మంది మృతి
సంగీత కచేరీ కార్యక్రమానికి ఒక గంట ముందు ట్విట్టర్ ద్వారా ఐసిస్.. ఆత్మాహుతి దాడి జరగబోతున్నట్లు పేర్కొందని సమాచారం. మాంచెస్టర్ అరెనా హ్యాష్ట్యాగ్తో చేసిన ఈ ట్వీట్లో తమ హెచ్చరికకు ఐసిస్ జెండాను జతచేశారు. 'మా దాడిని మరిచిపోయారా? భయం అంటే ఇదే' అంటూ ఐసిస్ ఉగ్రవాదులు అందులో పేర్కొన్నారు.
బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది. దాడి అనంతరం తమ ఎటాక్ విజయవంతమైందంటూ ఐసిస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకోవడం గమనార్హం.
ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఇలాంటివి చాలా జరుగుతాయని వారు హెచ్చరించారు. కాగా, దాడికి సంబంధించి ఐసిస్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.