ఐసిస్ ముందే హెచ్చరించిందా?: మాంచెస్టర్ ఎటాక్లో వెలుగుచూసిన నిజం!?..
బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది.
మాంచెస్టర్: ఆత్మాహుతి దాడితో ఇంగ్లాండు ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. సంగీతంలో ఓలలాడుతున్న మాంచెస్టర్ ప్రజలు.. ఆత్మాహుతి దాడితో ఒక్కసారి భీతావహులుగా మారిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి ముందస్తు హెచ్చరిక వెలువడినట్లు తెలుస్తోంది.
సంగీత కచేరీ కార్యక్రమానికి ఒక గంట ముందు ట్విట్టర్ ద్వారా ఐసిస్.. ఆత్మాహుతి దాడి జరగబోతున్నట్లు పేర్కొందని సమాచారం. మాంచెస్టర్ అరెనా హ్యాష్ట్యాగ్తో చేసిన ఈ ట్వీట్లో తమ హెచ్చరికకు ఐసిస్ జెండాను జతచేశారు. 'మా దాడిని మరిచిపోయారా? భయం అంటే ఇదే' అంటూ ఐసిస్ ఉగ్రవాదులు అందులో పేర్కొన్నారు.

బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది. దాడి అనంతరం తమ ఎటాక్ విజయవంతమైందంటూ ఐసిస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకోవడం గమనార్హం.
ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఇలాంటివి చాలా జరుగుతాయని వారు హెచ్చరించారు. కాగా, దాడికి సంబంధించి ఐసిస్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications