ఇజ్రాయెల్ దాడులు: లెబనాన్లో మేయర్ సహా 20 మంది మృతి
లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. వైమానిక దాడులపై అమెరికా అభ్యంతరం తెలిపినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆరు రోజుల తర్వాత బీరూట్ లోని దక్షిణ ప్రాంతంతోపాటు ఇతర ప్రదేశాల్లో బుధవారం భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపింది. బీరూట్లో నివాస భవనం కింద ఉన్న హెజ్బొల్లా ఆయుధ గోదాంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్లో హెచ్చరిక పోస్టు చేసిన గంట తర్వాత మొదటి దాడి జరిగింది. అనంతరం మరో రెండు దాడులు జరిపింది. కాగా, నబతిహ్ మున్సిపాలిటీ భవనంపై జరిగిన దాడిలో మేయర్ సహా 20 మంది మృతి చెందారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై సమావేశం జరుగుతుండగా ఐడీఎఫ్ దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. భవనాల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

కాగా, బీరుట్పై దాడులు తగ్గుతాయని అమెరికా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు ఆపడటం లేదని లెబనాన్ తాత్కాలిక ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నబతిహ్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో 11 దాడులు జరిగినట్లు గవర్నర్ వెల్లడించారు. ఇక, మంగళవారం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు, తమ భూభాగంపై 90 రాకెట్లతో హెబ్బొల్లా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇక, మంగళవారం పొద్దుపోయిన తర్వాత లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. భవనాల శిథిలాల కింద నుంచి 15 మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తమ భూభాగంపై 90రాకెట్లతో హెజ్బొల్లా దాడులు చేసినట్లు IDF ప్రకటించింది. ఈ దాడులు ఏ ప్రాంతంపై జరిగాయనేది వెల్లడించలేదు.
ఇటీవల లెబనాన్లోని అపార్ట్మెంటుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 12 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 22 మంది చనిపోయారు.ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్థ స్వతంత్ర విచారణకు ఆదేశించింది. అయితే, హెజ్బొల్లా, హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది.
-
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications