పాక్ కొత్త వాదన: ఉగ్రదాడుల గురించి జాధవ్ కీలక సమాచారమిచ్చాడు
పాకిస్తాన్ ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాదవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొన్నా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాదవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొన్నారని చెప్పుకొచ్చింది.
పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటలిజెన్స్ సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొంటున్నారని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే జాదవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలపలేదు.గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.












Click it and Unblock the Notifications