బీరట్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం, కమ్ముకొన్న పొగ, రంగంలోకి దిగిన ఆర్మీ..
లెబనాన్ రాజధాని బీరట్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. కానీ ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. పోర్టులో గల టైర్లు, ఆయిల్ స్టోర్ చేసే గిడ్డంగిలో ప్రమాదం జరిగిందని లెబనీస్ ఆర్మీ అధికారులు తెలిపారు.
ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పివేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. పోర్టు సమీపంలో గల కంపెనీల నుంచి ఉద్యోగులను తరలించాలని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఏడేళ్ల క్రితం జరిగిన ప్రమాదం కళ్లముందు కదలాడుతోంది. గిడ్డంగిలో నిల్వ ఉంచిన 2 వేల 750 టన్నుల అమ్మోనియం నెట్రైట్ పేలుడు జరగడంతో 191 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆ తర్వాత పేలుడు జరగడంతో కాస్త భయంగానే ఉంది.












Click it and Unblock the Notifications