ఎవరెస్ట్ పర్వతం మీదకు చేరిన కోవిడ్... ఓ పర్వతారోహకుడికి పాజిటివ్
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.
కొన్ని వారాల ముందే ఎవరెస్ట్ పర్వతాన్ని పర్వతారోహకుల కోసం తెరిచారు.
నార్వేకు చెందిన అధిరోహకుడు ఎర్లెండ్ నెస్కు కోవిడ్ పాజిటివ్ నిర్థరణ కావడంతో ఎనిమిది రోజులు ఐసొలేషన్లో ఉంచారు.
నెస్ బృందంలో ఒక షెర్పాకు కూడా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
నేపాల్కు ఇది పెద్ద దెబ్బే. ఎవరెస్ట్ యాత్రల వల్ల ఆ దేశానికి అధిక ఆదాయం లభిస్తుంది.
నెస్కు ఈ వైరస్ ఎలా సోకిందో తెలీదుగానీ ఖుంబు లోయలో టీ తాగడం కోసం ఆగినప్పుడు ఆ దుకాణాల దగ్గరే సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
"నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను మరింత కఠినంగా పాటించవలసింది. ట్రెక్లో ఎక్కువమంది మాస్క్ పెట్టుకోలేదు" అని నెస్ చెప్పారు.
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ ఎవరెస్ట్ ఎక్కుతున్న చైనా పర్వతారోహకులు
పర్వతం ఎక్కుతుండగా నెస్ అనారోగ్యం పాలయ్యారు. ఆరు రోజులు అక్కడే అవస్థ పడ్డారు. తరువాత ఏప్రిల్ 15న ఆయనను హెలికాప్టర్లో నేపాల్లోని కాఠ్మండూ తరలించారు.
కాఠ్మండూలో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా నెస్కు కోవిడ్ సోకినట్లు నిర్థరణ అయింది.
అయితే, ఆయన త్వరగానే కోలుకున్నారు. ఏప్రిల్ 22న చేసిన టెస్టుల్లో కోవిడ్ నెగటివ్ వచ్చింది.
ఈ ఏప్రిల్లో అనేకమంది విదేశీయులు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మహమ్మారి కారణంగా అధిరోకులకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏడాదిపాటూ మూసి వేశారు.
ఎవరెస్ట్ పర్వతారోహణ ద్వారా నేపాల్కు సంవత్సరానికి 4 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని కాఠ్మండూ పోస్ట్ తెలిపింది.
ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించేందుకు 72 గంటల లోపల కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే నేపాల్లోకి అనుమతిస్తారని ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: 'రిపోర్టులన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)