మీరెన్ని చర్యలు తీసుకున్నా ఫర్లేదు : మసూద్ విషయంలో ప్రపంచ దేశాలు మా వైపేనన్న ఇండియా
న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మోకాలాడ్డిన చైనా వైఖరిని భారత్ తప్పుపట్టింది. అజార్, ఆయన సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు నిరంతరం పోరాడుతామని శనివారం స్పందించింది. ఉప ఖండంలో ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోమని .. ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టంచేసింది.

నిరంతరంగా ప్రయత్నిస్తాం ..
మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా అడ్డుపడలేదు .. కేవలం సాంకేతిక కారణాలే చూపించింది. కానీ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టంచేసింది. బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ .. మసూద్ ను అంతర్జాతీయ తీవ్రవాదని ప్రతిపాదన చేయగా .. డ్రాగన్ కంట్రీ టెక్నికల్ ఇష్యూస్ తెరపైకి తీసుకొచ్చి అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఉగ్రవాదం చైనాకు కూడా సమస్యే ...
ఉగ్రవాదం చైనాకు కూడా ప్రధాన సమస్యే అని ఇండియా విశ్వసిస్తోంది. పాకిస్థాన్ లో ఎన్ని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నాయో చైనాకు తెలుసు. కానీ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు మాత్రం అడ్డుకొని .. తన వైఖరిని స్పష్టంచేస్తోంది. దీంతో మరోసారి చైనా, పాకిస్థాన్ బంధం ప్రపంచానికి అర్థమైంది అని భారత విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఫలించిన ఒత్తిడి .. అంగీకరించిన దేశాలు
పుల్వామా దాడుల తర్వాత అంతర్జాతీయ సమాజం మీద భారత్ చేసిన ఒత్తిడి ఫలించింది. జైషే మహ్మద్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు అగ్రదేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అంగీకరించి .. ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశాయి. అయితే చైనా అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల ఉనికి లేకుండా చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు నడుస్తామని భాతర్ స్పష్టంచేసింది.
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
మరో యుద్ధం ప్రారంభం! -
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications