పాకిస్థాన్ పార్లమెంట్ రద్దు - ఇమ్రాన్ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం : 90 రోజుల్లో ఎన్నికలు..!!
పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం ఎన్నికల దిశగా మళ్లింది. ప్రధాని ఇమ్రాన్ ఊహించని అడుగులతో ప్రతిపక్షాలను ఎన్నికల బరిలోకి దిగేలా చేసారు. ఇమ్రాన్ ఖాన్ పైన జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరగాల్సి ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై పార్లమెట్లో ఓటింగ్ వాయిదా పడింది. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి లేఖ రాసారు. పార్లమెంట్ ను రద్దు చేయాలని సిఫార్సు చేసారు. తాజాగా ప్రజా తీర్సుకు రికమెండ్ చేసారు. దీంతో..రాష్ట్రపతి ప్రధాని చేసిన సిఫార్సును ఆమోదిస్తూ పార్లమెంట్ రద్దుకు నిర్ణయించారు.
90 రోజుల్లోగా పాకిస్థాన్ లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్ష హోదాలో ఆదేశించారు. అంతకుముందు, పాకిస్థాన్ పార్లమెంట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. ఈ సమయంలో ప్రధాని ఇమ్రాన్ సభకు హాజరు కాలేదు. అంతలో...సభలో డిప్యూటీ స్పీకర్ అనూహ్య ప్రకటన చేసారు. విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు.

తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభలోని సభ్యులను కొనేందుకు కుట్ర చేసారని..కోట్లాది రూపాయలను ఖర్చు చేసారని చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం పాక్ పై జరిగిన కుట్ర గా అభివర్ణించారు.
Pakistan President Arif Alvi dissolves National Assembly on the advice of Prime Minister Imran Khan: Pakistan Media
— ANI (@ANI) April 3, 2022
జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసినట్లుగా ఇమ్రాన్ వెల్లడించారు. ప్రజలే తమను ఎవరు పాలించాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పద్దతితో ఎన్నికలు జరగాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు దేశంలో మధ్యంతర ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకోవటంతో.. ఇప్పుడు పాకిస్థాన్ లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications