'పఠాన్కోట్'పై షరీఫ్ ఆదేశాలు: సోదాలు, అరెస్టులు
లాహోర్: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తుకు ముందడుగు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. పఠాన్కోట్ పైన దాడి కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా వార్తలు వతెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇంటర్ సర్వీసెస్ (ఐఎస్ఐ), మిలటరీ (ఎంఐ) అధికారులతో ఇవాళ సమావేశమైన నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద దాడిపై భారత్ ఆధారాలు అందించడం ఈ చర్యకు ముందడుగు పడింది.

ఉగ్రదాడి సూత్రధారులపై చర్యలకు, ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీకి భారత్ ముడిపెట్టడంతో పాకిస్తాన్ ఈ దర్యాప్తుకు ముందుకొచ్చినట్లుగా భావిస్తున్నారు.
అంతేకాదు, పాకిస్తాన్ అధికారులు కొన్నిచోట్ల దాడులు కూడా నిర్వహించారని తెలుస్తోంది. కొందర్ని అరెస్టు చేశారని సమాచారం. గుజ్రాన్వాలా, ఝెలమ్, బహవల్పూర్ జిల్లాల్లో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారని తెలుస్తోంది. కాగా, నవాజ్ షరీఫ్కు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ ఫోన్ చేసి..పఠాన్కోట్ దాడి నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
-
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications