Viral News: పగలు కాటి కాపరి.. రాత్రి కాగానే శవాలను బయటకు తీసి.. ఈ మహిళ చేసే పని చూస్తే గుండెలు ఆగిపోతాయి..!
అమె ఒక కాటి కాపరి.. స్మశానంలో ఉంటూ జీవనం కొనసాగిస్తూ.. పగలు శవాల ఖననానికి సహకరించి డబ్బులు తీసుకుంటుంది. కానీ రాత్రి అయితే ఆమె వికృత చేష్టలు బయటకొస్తాయి. ఆమె ఆర్ధరాత్రి సమయాల్లో పాతి పెట్టిన శవాలను బయటకు తీస్తుంది. మృతదేహలలోని బాడీ పార్టులను మాయం చేస్తుంది. వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. ఈ బాగోతం చివరికి బయటపడింది. దీంతో ఆమె కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

మేగన్ హెస్
మేగన్ హెస్ అనే 46 ఏళ్ల మహిళ కొలరాడోలోని మాంట్రోస్లోని స్మశానంలో కాటి కాపరిగా పనిస్తున్నారు. ఆమె తన తల్లి షిర్లీ కోచ్ స్మశానం పక్కనే నివసిస్తుండేవారు. కాటి కాపరిగా విధులు నిర్వహిస్తున్న మేగన్ హెస్ పగలు స్మశానంలో ఖననానికి వచ్చే వారి వివరాలు తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేది. మృత పాతపెట్టిన రోజు రాత్రి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కళ్లు, కిడ్నీలు, పలు అవయవాలను బయటకు తీసి అమ్ముకునేది.

560 శవాలు
ఇలా దాదాపు 560 శవాల నుంచి అవయవాలను బయటకు తీసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఒక రోజు రాత్రి శవాన్ని బయటకు తీస్తుండగా కొందరు వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు మేగన్ హెస్ అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల దర్యాప్తులు తాను నేరం చేసినట్లు వారు అంగీకరించింది. అనుమతి లేకుండా శరీర భాగాలను విక్రయించడం ద్వారా చనిపోయిన వారి బంధువులను మోసం చేసినందుకు మేగన్ హెస్ 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

15 సంవత్సరాలు
ఆమె తల్లి షిర్లీ కోచ్ 15 సంవత్సరాల శిక్ష విధించింది. మార్పిడి కోసం గుండెలు, మూత్రపిండాలు మరియు స్నాయువులు వంటి అవయవాలను విక్రయించడం యునైటెడ్ స్టేట్స్లో చట్టవిరుద్ధం. వాటిని దానం మాత్రమే చేయాలి. కానీ మేగన్ తలలు, చేతులు, వెన్నుముక వంటి శరీర భాగాలను అమ్మడం ద్వారా నేరం చేసింది. హెస్, కోచ్ శరీరాలను అనధికారికంగా విచ్ఛిన్నం చేశారని మాజీ కార్మికురాలు ఆరోపించింది.

శస్త్రచికిత్స-శిక్షణ సంస్థలు
హెస్ నుండి చేతులు, కాళ్లు, తలలు, మొండెంలను కొనుగోలు చేసిన శస్త్రచికిత్స-శిక్షణ సంస్థలు, ఇతర సంస్థలకు అవి మోసపూరితంగా పొందినట్లు తెలియదని న్యాయవాదులు తెలిపారు. తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి హెస్, కోచ్లను వెంటనే జైలుకు పంపాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications