Niger: నైగర్లో ఉన్న భారతీయులు వెంటనే దేశాన్ని విడాలి.. విదేశాంగ శాఖ హెచ్చరిక..
ఆఫ్రికన్ దేశంలో నైగర్ లో సైనిక తిరుగుబాటు తరువాత భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
నైగర్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ప్రజలు నియామీకి ప్రయాణిస్తుంటే తమ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం వీడాలని పేర్కొంది.
"నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, వారి ఉనికి అవసరం లేని భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని వారు గుర్తుంచుకోవచ్చు. బయలుదేరేటప్పుడు భూ సరిహద్దు ద్వారా భద్రతను నిర్ధారించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో నైగర్కు వెళ్లాలని ప్లాన్ చేసే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు వారి ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని సూచించారు" అని MEA తెలిపింది.

"నియామీ (నైగర్ రాజధాని)లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని భారతీయ పౌరులందరూ త్వరితగతిన ఖాలీ చేయాలని సలహా ఇస్తున్నారు. భారతీయ పౌరులు నియామీలోని భారత రాయబార కార్యాలయంలో అత్యవసరంగా సంప్రదించవచ్చుని చెప్పారు. భారతీయులు 22799759975 నంబర్ సప్రందిచాలని" అని MEA పేర్కన్నారు. నైగర్లో చిక్కుకున్న భారతీయుల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు బగ్చి స్పందిస్తూ "సుమారు 250 మంది భారతీయులు ఉన్నారు. భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని MEA అభ్యర్థిస్తోంది. నియామీలోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందన్నారు.

గత నెల చివరి నుంచి ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ సైనిక తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యాడు. అయితే విదేశాలు దాడుల చేస్తాయని సైనిక ప్రభుత్వం గగనతలాన్ని మూసివేశారు. నైగర్ దేశంలోని కొందరు వ్యక్తులు పెద్దమొత్తంలో బియ్యం మరియు వంట నూనె వంటి ప్రధానమైన వస్తువులను కొనుగోలు చేయడానికి సూపర్ మార్కెట్లకు తరలివచ్చారు. మరికొందరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications