విహారయాత్రలో విషాదం: బ్రేకులు ఫెయిలయి.. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని..
విహారయాత్రకు బయలేదేరిన ఓ కాలేజీ బస్సు అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ తోపాటు 13 మంది విద్యార్థులు మరణించారు.
మనీలా: ఫిలిప్పీన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు బయలేదేరిన ఓ కాలేజీ బస్సు అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ తోపాటు 13 మంది విద్యార్థులు మరణించగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మనీలాకు తూర్పు దిశగా ఉన్న రిజ్వాల్ రాష్ట్రంలోని తనయ్యా పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో మనీలాకు చెందిన బెస్ట్ లింక్ కాలేజీ విద్యార్థులు రీసెర్చ్ ఫీల్డ్ ట్రిప్ కోసం మొత్తం 9 బస్సుల్లో బయలుదేరి వెళుతుండగా ఒక్క బస్సు ప్రమాదానికి గురైంది.

డౌన్ హిల్ రోడ్డులోకి వచ్చేసరికి బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం అమాంగ్ రోడ్రిగ్స్ మెడికల్ సెంటర్ కు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది వరకు విద్యార్తులు ఉన్నారు. బస్సు కూడా అమితమైన వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు రూఫ్ టాప్ పూర్తిగా బస్సునుంచి విడిపోయి ఒక పక్కన పడిపోయింది. సీట్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications