కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రైవర్ నిర్లక్ష్యం: బస్సును ఢీకొన్న రైలు, చిన్నారితోపాటు 19మంది మృతి

శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్‌స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

|
Google Oneindia TeluguNews

మాస్కో: శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్‌స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు 19మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు.

ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు.. బస్సును ఢీకొంది. క్షతగాత్రుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.

Total devastation as train ‘tears apart’ bus, killing 19 including child

గాయాలపాలైన వారిని సహాయక సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉజ్బెకిస్తాన్ నుంచి కార్మికులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రమాదానికి గురైన బస్సు కజకిస్థాన్‌లో రిజిష్టర్ అయిందని రష్యా అధికారులు తెలిపారు.

English summary
AT least 19 people – including a child – are dead after a train smashed into a crowded bus on a railway crossing in Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X