పాక్ వర్సిటీపై ఉగ్రదాడి: ఎవరీ ఉమర్ మన్సూర్?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బచాఖాన్ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఓ ప్రొఫెసర్ తోపాటు సుమారు 70మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారు.
కాగా, ఈ దాడి వ్యూహకర్త కరడు గట్టిన ఉగ్రవాది ఉమర్ మన్సూర్ అని పాక్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ తెహ్రీక్ ఈ తాలిబన్(టిటిపి) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్ర సంస్థ జరిపే దాడులన్నింటికీ ఉమర్ మన్సూరే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ ఉమర్ మన్సూర్
ఖైబర్ ఫఖ్తున్వాలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలన్నీ ఉమర్ మన్సూర్ నేతృత్వంలోనే జరుగుతాయి. 2014 డిసెంబర్ 16న పెషావర్ ఆర్మీపబ్లిక్స్కూల్పై జరిగిన దాడిలో ఇతని హస్తమే వుందని దర్యాప్తులో వెల్లడయింది.
పాక్ సైనికదళాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక దాడులను అడ్డుకునేందుకు సైనిక సారథ్యంలోని విద్యాసంస్థలపై విరుచుకుపడాలని.. మన్సూర్ పాక్ తాలిబాన్లకు సూచించినట్టు సమాచారం.2014లో ఆఫ్గన్కు పారిపోయిన మన్సూర్ అక్కడ నుంచే కార్యకలాపాలను కొనసాగించాడు.
మలాలా యూసుఫ్ జాయ్ను చంపాలని ఆదేశాలు జారీ చేసిన టిటిపి లీడర్ ముల్లా ఫజ్లుల్లాహ్కు మన్సూర్ సన్నిహితుడని తెలుస్తోంది. పెషావర్ సైనిక పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో కూడా ఇతడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. డిసెంబర్ 16, 2014లో జరిగిన ఈ దాడిలో 150మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది మృతి చెందారు.
వాలీబాల్ అంటే ఇష్టపడే మన్సూర్ను ఫస్తూన్ భాషలో నరయ్ అని పిలుస్తారు. దీనర్థం స్లిమ్ అని. కాగా, విద్యార్థులను, అమాయకులను ఊచకోత కోస్తున్న మన్సూర్ను పాక్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మన్సూర్ను ఇప్పుడు యావత్ పాక్ ద్వేషిస్తోంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications