‘‘ఉత్తరకొరియాతో జాగ్రత్త! కళ్లుమూసుకుని యుద్ధానికి దిగకండి..’’
టోక్యో: ఉత్తరకొరియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆచి తూచి అడుగేయాలని, కళ్లుమూసుకుని యుద్ధానికి దిగరాదని.. ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు.
జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలిసి అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో గుటెర్రస్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఈ మేరకు ఒక హెచ్చరిక చేశారు.

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను నియంత్రించాలంటే ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పూర్తిస్థాయిలో అమలుపరచాలని ఆయన హితవు పలికారు. శాంతియుత మార్గంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, యుద్ధానిి దిగడం సరైన పద్ధతి కాదని ఆంటోనియో అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఇటీవలే ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరిపింది.
దీనిని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్తోపాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఉత్తరకొరియా అధినేత కిమ్.. దేశ అణుశక్తిని మరింత బలోపేతం చేయాల్సిందిగా తమ దేశ మిలిటరీ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications