పాలస్తీనాకు భారత్ సహా 142 దేశాల అండ..! ఐరాసలో ఒంటరైన అమెరికా, ఇజ్రాయెల్..!
దశాబ్దాల నాటి పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారంగా రెండు దశాల గుర్తింపు పరిష్కారాన్ని సూచిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజార్టీ దేశాలు అండగా నిలిచాయి. పాలస్తీనా నిత్య రావణకాష్టంగా మారడం, గాజాలో మానవతా సంక్షోభం కొనసాగుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ ఈ పరిష్కారాన్ని సూచిస్తూ ఐరాసలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి భారత్ సహా 142 దేశాలు మద్దతు పలికాయి.
పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం చేయాలని, పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ ను రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించాలని, దురాక్రమణలకు, యుద్దానికి ముగింపు పలకాలని కోరుతూ ఫ్రాన్స్ ఐరాసలో ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి మద్దతుగా 142 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగరీ సహా 10 దేశాలు మాత్రం వ్యతిరేకంగా ఓటేశాయి. మరో 12 దేశాలు ఏ అభిప్రాయం చెప్పకుండా తటస్టంగా ఉండిపోయాయి.

న్యూయార్క్ డిక్లరేషన్ పేరుతో ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రతుల్ని జూలైలోనే ఐరాస హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో అన్ని దేశాలకు అందించారు. ఇందులో వివిధ దేశాల నాయకులు గాజాలో యుద్దానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం చూపేందుకు రెండు దేశాల విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్ సార్వభౌమ పాలస్తీనాకు అంగీకరించాలని సూచించారు.
#WATCH | New York, USA: India votes in favour as the UN General Assembly (UNGA) adopts a resolution backing the New York declaration on Palestine, endorsing the two-state solution.
— ANI (@ANI) September 12, 2025
Source: UNTV via Reuters pic.twitter.com/CD7aA9B8XH
అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై హింసను ఆపాలని, తూర్పుజెరూసలెం సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో సెటిల్మెంట్లు, ఆక్రమణలు నిరోధించాలని కోరారు. పాలస్తీనా ప్రజల జీవించే హక్కుకు మద్దతు ఇస్తున్నట్లు ఈ తీర్మానం పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, అంతర్జాతీయంగా ఈ ప్రాంతంలో శాంతి, సుస్దిరతలు నెలకొల్పేందుకు, పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించాలని ఇందులో కోరారు. ఈ ప్రయత్నంలో విఫలమైతే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం కష్టమని హెచ్చరించారు. గాజా పాలస్తీనాలో భాగమని, అది వెస్ట్ బ్యాంక్ తో కలిసే ఉండాలని సూచించారు. అక్కడ ఎలాంటి అక్రమణలు చేయరాదని, ప్రజల్ని తరలించరాదని సూచించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications