పాక్ గుట్టు బయటపెట్టిన ట్రంప్..! భారత్ ను ఆపడానికి ఇన్ని చేసిందా ?
భారత్ లో గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ముందుగా తీవ్రవాద స్థావరాలను, ఆ తర్వాత పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను మన సైన్యం ధ్వంసం చేసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్ కు ఇరు దేశాల కాల్పుల విరమణ ప్రకటనలతో తెరపడింది. అయితే దీని వెనుక ఏం జరిగిందో తెలిసేలా అమెరికా కొన్ని రహస్య పత్రాల్ని బయటపెట్టింది.
అమెరికాలో బయటపడ్డ తాజా పత్రాల్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఎలాగైనా ఆపేందుకు పాకిస్తాన్ చేసిన రాక్షస ప్రయత్నాలు వెల్లడయ్యాయి. ఇందులో అమెరికాలోని ప్రభావ వంతులైన వ్యక్తులు, సంస్థలతో లాబీయింగ్ కోసం దాదాపు 60 కీలక సమావేశాలు జరిగినట్లు ఈ పత్రాల్లో తేలింది. అమెరికాలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలు, రక్షణ అధికారులు అమెరికా ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న వారితో 50 సమావేశాలు జరిపినట్లు తెలిసింది. వీరిలో అమెరికా చట్టసభ సభ్యులు, ప్రభావశీలమైన మీడియా సంస్థలు కూడా ఉన్నాయని వెల్లడైంది.

అమెరికా విదేశీ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ చట్టం కింద దాఖలు చేసిన రికార్డులు, అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి, దాని రక్షణ సంబంధిత 60 మందికి పైగా అధికారులు, మధ్యవర్తులతో ఇమెయిల్లు, ఫోన్ కాల్లు, వ్యక్తిగత సమావేశాల ద్వారా పదేపదే సంప్రదించారని సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం యొక్క సైనిక చర్యను ఏదో విధంగా ఆపడం, జోక్యం కోసం అమెరికాను ఒత్తిడి చేయడం దీని లక్ష్యం అని తేలింది.

పాకిస్తాన్ ఈ లాబీయింగ్ ను అక్కడి కాంగ్రెస్, పెంటగాన్, విదేశాంగ శాఖ, ప్రముఖ అమెరికన్ జర్నలిస్టులతో చేసింది. పాకిస్తాన్ ప్రతినిధులు కాశ్మీర్, ప్రాంతీయ భద్రత, అరుదైన భూమి ఖనిజాలు, విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై ఇందులో చర్చించారు. ట్రంప్ ప్రభుత్వంలో లాబీయింగ్ కోసం, వాణిజ్య, దౌత్య ఫలితాలను పొందేందుకు పాకిస్తాన్ ఏటా సుమారు $5 మిలియన్ల విలువైన ఆరు వాషింగ్టన్ లాబీయింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications