కరోనా విలయం: అమెరికాలో ఒక్కరోజే 2 వేల మంది మృతి, ఇటలీ తర్వాత యూఎస్, లక్షకు చేరిన మృతులు...
కరోనా వైరస్ అమెరికాపై పెను ప్రభావం చూపుతోంది. వైరస్ సోకిన జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత 24 గంటల్లో అమెరికాలో 2 వేల 108 మంది వైరస్ సోకి చనిపోయారు. వైరస్ విలయతాండవం చేసిన ఇటలీలో కూడా ఇన్ని మరణాలు ఒకేరోజు నమోదుకాలేదు. కానీ అమెరికాలో మాత్రం రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది.
అమెరికాలో 2108 మంది చనిపోయారని జాన్స్ హొప్కిన్స్ యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అక్కడ చనిపోయిన వారి సంఖ్య 18 వేల 586కి చేరుకున్నది. వైరస్ సోకిన వారి సంఖ్య 5 లక్షలకు చేరువవుతున్నది. 4 లక్షల 96 వేల 535 మందిగా ఉందని పేర్కొన్నది. గత 24 గంటల్లో35 వేల 98 పాజిటివ్ కేసులు నమోదవడం అగ్రరాజ్యాన్ని మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

కరోనా వైరస్ ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 18 వేల 849కి చేరింది. ఆ వెనకాలే అమెరికా నిలిచింది. తర్వాత స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. ఇటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. వైరస్ సోకి వివిధ దేశాల్లో లక్షలాది మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు.
Recommended Video
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications