ఇలా చేయడం యుద్దాన్ని ఆహ్వానిస్తున్నట్టే: భారత్ పై పాక్ సంచలనం
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే ఇదే విషయంపై తాజాగా పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ బలహీనపరుస్తోందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం పాకిస్తాన్ పై తీవ్రంగా పడింది. నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ముసలి కన్నీరు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగానే సింధూ జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని అన్నారు. తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. సింధూ నది జలాల ఒప్పందం మూలాలను భారత్ చర్యలు దెబ్బతీస్తున్నాయని అన్నారు.
ఈ మేరకు చీనాబ్ నది ప్రవాహంలో మార్పులపై పాకిస్థాన్ వివరణ కోరిన మరుసటి రోజు దార్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ లో భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చూశామని వివరించారు. "ఈ ఏడాది ఏప్రిల్ లో భారత్ ఏకపక్షంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చూశాం.. కానీ, ఇప్పుడు మనం చూస్తున్నది భారత్ చేస్తున్న ఉల్లంఘనలు. ఇవి ఒప్పంద మూలాలను దెబ్బతీస్తూ, ప్రాంతీయ స్థిరత్వానికి, అంతర్జాతీయ చట్టాల పవిత్రతకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి" అని దార్ అన్నారు.
భారత్ నీటిని మ్యానిపులేట్ చేయడంపై పాకిస్థాన్ సింధూ కమిషనర్.. భారత్ లోని సింధూ కమిషనర్ కు లేఖ రాశారని దార్ వెల్లడించారు. సింధూ జలాల నిలిపివేతతో పాకిస్థాన్ లోని వ్యవసాయ రంగం దెబ్బతింటోందని.. దేశంలోని జీవనోపాధికి ముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఆరోపించారు. సింధూ నది జలాలకు సంబంధించిన డేటాను కూడా భారత్ నిలిపివేసిందని దార్ మండిపడ్డారు. నీటిని నిలిపివేయడం కూడా యుద్ధాన్ని ప్రేరేపించినట్టేనని తెలిపారు.

ఇక సింధూ జలాల ఒప్పందం 1960లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా సింధు నది వ్యవస్థలోని ఆరు ఉప నదుల నీటిని ఇరు దేశాలు ఉపయోగించుకుంటాయి. తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ భారత్ కు అలాగే పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం పాకిస్థాన్ కు కేటాయించారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications