తుమ్మల తుప్పలు కావాలా? పువ్వాడా..: మాజీ మంత్రి, ఎంపీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు
ఖమ్మం: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావుపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే స్యయంగా చూశారని అన్నారు. పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి.. ఇక మీ ఇష్టమని ఖమ్మం ప్రజలకు స్పష్టం చేశారు కేసీఆర్. ప్రభుత్వ విజన్.. పువ్వాడ మిషన్ తో ఖమ్మం అభివృద్ధి సాధ్యమైందన్నారు. వాడవాడలో పువ్వాడ అజయ్ అని పత్రికల్లో వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. రూ. 700 కోట్లు ఖర్చు చేసి ఈ జిల్లాను పువ్వాడ అభివృద్ధి చేయించారని కేసీఆర్ తెలిపారు. పువ్వాడ అజయ్ను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని హామీ ఇచ్చారు కేసీఆర్.

పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే.. తుమ్మల నాగేశ్వరరావును పిలిచి మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ చెప్పారు. తుమ్మల వల్ల ప్రజలకు జరిగిన మేలు శూన్యమని విమర్శించారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తానని ఓ అర్భకుడు అంటున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఖమ్మం జిల్లాను ఆయన గుత్తకు తీసుకున్నారా? అని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
— BRS Party (@BRSparty) November 5, 2023
ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందో అలాంటి పార్టీనే ఎన్నుకోవాలి. పార్టీ, అభ్యర్థి చరిత్ర చూసి… pic.twitter.com/eGaKRsmIEh
కేసీఆర్ బతికి ఉన్నంత వరకూ తెలంగాణ లౌకిక రాజ్యంగానే ఉంటుందన్నారు కేసీఆర్. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీలదేనని అన్నారు. ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. అభ్యర్థుల గుణగణాలు, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను గమనించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఓటర్లు పరిణితితో ఓటువేస్తేనే.. ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications