బాలుడిని వదలని కామాంధులు, సామూహిక లైంగికదాడి, ఇద్దరి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి, వరసే కాదు.. చిన్న, పెద్ద అని కూడా చూడటం లేదు. కర్నూలులో ఓ బాలుడిపై నలుగురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. తర్వాత వికృతంగా ప్రవర్తించడంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. జగిగిన ఘటన గురించి బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

డిన్నర్ పేరు చెప్పి..
కర్నూలులో ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయం కోసం వినియోగించిన గదిలోనే దారుణం జరిగింది. బుల్లెట్ రాజా, రాజా, ప్రవీణ్, కుమార్ అనే నలుగురు అక్కడే ఉంటారు. మైనింగ్ పనులు చేసే వీరు జులాయ్గా తిరుగుతుంటారు. వీరిపై రౌడీ షీటర్ కూడా నమోదైంది. అయితే మూడురోజుల క్రితం పార్టీ కోసం పనిచేసిన 14 ఏళ్ల యువకుడిని కార్యాలయంలోకి తీసుకెళ్లారు. డిన్నర్ ఇస్తామని చెప్పి.. లైంగికదాడి చేశారు.

వికృత చర్యలు..
బాలుడిపై లైంగికదాడి చేసి ఊరుకోలేదు. అందులో చిపిరి పిడి పెట్టేందుకు ప్రయత్నించారు. బాలుడు వద్దు మొర్రొ అని మొత్తుకున్నా పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనను వీడియో కూడా తీసి క్రూర మనస్తత్వాన్ని చాటుకొన్నారు. తర్వాత ఇంటికొచ్చిన బాలుడు మిన్నకుండిపోయాడు. అతను అస్వస్థతకు గురవడంతో ఏం జరిగిందని పేరెంట్స్ ఆరాతీశారు. దీంతో జరిగిన ఘటనను వివరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

పరారీలో మరో ఇద్దరు..
బాలుడికి బనగానపల్లెలో చికిత్స అందజేసి.. పంపించేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది. మరో ఇద్దరిని పట్టుకొంటామని పోలీసులు చెప్తున్నారు. ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని పేరెంట్స్ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications