పెళ్లికి పెద్దల నో.. లవర్స్ సూసైడ్.. కానీ ఇద్దరు మైనర్లే
ప్రేమించుకున్నాం.. పెళ్లి చేయమని అడిగితే పెద్దలు నో అన్నారు. చేసేది లేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. కాకపోతే వీరిద్దరూ మైనర్లు కావడం విశేషం. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ప్రేమికుల మృతితో వారింట విషాదం నెలకొంది. నిజానికి వారిద్దరూ మైనర్లు.. చట్టరీత్యా పెళ్లి చేసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ పెద్దలు అంగీకరించలేదు.
చనిపోయిన ప్రేమికులు కలిచర్ల, ఎబ్బనూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. యువతి ఇంటర్ పూర్తి చేయగా.. యువకుడు డిగ్రీ మధ్యలోనే ఆపివేశాడట. వారిద్దరికీ మాత్రం చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. స్కూల్లో చదివే రోజుల నుంచి ప్రేమ ఉంది. వారి విషయం ఇంట్లో తెలిసింది. ఇంకేముంది బెదిరిస్తారు.. కలువనీయరు అని అనుకున్నారు. ఇక అంతే బలవన్మరణానికి పాల్పడ్డారు.
Recommended Video
ఇద్దరు చక్కగా ఆలోచించారు. చనిపోదామని డిసైడ్ అయ్యారు. గ్రామ శివారులో గల రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నారు. వారి డెడ్ బాడీస్ చూసి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వారు బతికి ఉన్న సమయంలో పెళ్లికి నో అన్న పెద్దలు ఇప్పుడు.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.
ఇద్దరు మైనర్లే.. ఆకర్షణ ఏదో.. ప్రేమ ఏదో తెలియని వయస్సు. మరీ వారికి కౌన్సిలంగ్ ఇవ్వాల్సింది. కానీ అలా చేయక.. పెళ్లి చేయమని మొహం మీదే చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక వారిద్దరూ చనిపోయారు. ఇప్పుడు పెద్దలు బాధ పడుతున్నారు.