80 శాతం ఎక్సైజ్ సిబ్బందిపై కేసులు, సీమాంధ్ర పాలకుల పనే: పద్మారావు
హైదరాబాద్: తెలంగాణలోని 80 శాతం ఎక్సైజ్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కేసులు ఎదుర్కుంటున్నారని ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆబ్కారీ శాఖ 2016 డైరీని ఆవిష్కరించిన తర్వాత ఆయన ప్రసంగించారు.
గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు ఆబ్కారీ శాఖ ఉద్యోగులపై ఎసిబి కేసులు బనాయించారని తనకు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారని, అందువల్ల వాటిని ఉపసంహరిస్తామని మంత్రి చెప్పారు. ఆ మాట చెప్పగానే ఉద్యోగ సంఘాల నాయకులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసారు.

సమావేశంలో ఉన్న టిఎన్జీవో సంఘం నాయకుడు జి. దేవీప్రసాద్, కె. రవీందర్ రెడ్డి, ఉద్యోగులు మంత్రి హామీకి హర్షధ్వానాలు చేశారు. 325 మంది ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా ఎసిబి అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, లంచం తీసుకుంటుండగా ఎంత మంది ఉద్యోగులను ఎసిబి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందనే విషయాన్ని వారు వెల్లడించారు. అయితే, తెలంగాణ భావోద్వేగం కారణంగా ఆ కేసులను ఉపసంహరించుకుంటే చట్టబద్దమవుతుందా, కాదా అనేది తేలాల్సి ఉంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications