కలకలం: కోతుల గుంపు దాడిలో వృద్ధురాలు మృతి
నల్గొండ: సూర్యపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోతుల మంద దాడి చేయడంతో ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై ప్రాణం కోల్పోయింది. ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో చోటు చేసుకుంది. వృద్ధురాలి మరణం స్థానికంగా కలకలంగా మారింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాత సూర్యపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. ఎవరూ లేకపోవడంతో ఆమె ఉన్న ఇంటిలోకి కోతుల మంద ప్రవేశించింది. మంచంలో ఉన్న వృద్ధురాలుపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది.

కోతుల దాడిలో ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఎవరూ చూడకపోవడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. కోతుల గుంపు దాడి చేయడంతో వ్యక్తి ప్రాణం పోయిందన్న వార్త.. స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఊర్లో కోతుల బెడద ఎక్కువైందని... కోతులను గ్రామంలోకి రాకుండా చేయాలని అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు.
కోతుల గుంపు ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు కూడా ఎత్తుకెళుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ కోతులను బెదిరిస్తే.. అవి దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోతుల మంద దాడిలో వ్యక్తి ప్రాణం పోవడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. కోతులను గ్రామం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications