పవన్ కళ్యాణ్పై కేసు నమోదు: మీడియాపై దూషణలే కారణం!
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పవన్ అభిమానులు టీవీ9 కార్యాలయానికి ఫోన్ చేసి ఆ ఛానల్ సీఈవో రవి ప్రకాశ్ను ఉద్దేశించి ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ ఏప్రిల్ 21న పాత్రికేయ సంఘాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Recommended Video

ఈ సందర్భంగా పవన్ తన ట్విట్టర్లో పెట్టిన కామెంట్లు, మీడియా కథనాలను వక్రీకరించి అప్లోడ్చేసిన దృశ్యాలను వారు పోలీసులకు అందజేశారు. రవిప్రకాశ్తో పాటు ఇతర ఉద్యోగులను దూషించిన ఆడియోలను కూడా సమర్పించారు.

ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలతో పవన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
కాగా, గత కొద్ది రోజులుగా కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి పవన్ ట్విట్టర్ వేదిక విమర్శలు చేస్తున్న విషయం విధితమే. తన తల్లిని ఓ నటి దూషించిన వీడియో క్లిప్పును పదే పదే చూపడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications