Telangana: ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులు.. బీటేక్ విద్యార్థిని ఆత్మహత్య..
పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయల్ చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
పిల్లలను చదుకోమ్మని కళాశాలలకు పంపిస్తుంటే.. వారు చేసే పనులు తల్లిదండ్రులకు తీవ్ర క్షోభను మిగులుస్తున్నాయి. ఓ అమ్మాయి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. అవయవాలను బయటకు తీసిన హరిహరకృష్ణ ఉదంతం అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. చదువుకునే వయస్సులో ప్రేమ అంటూ వారు తీసుకునే నిర్ణయం చాలా జీవితాల్లో శోకాన్ని మిగుల్చుతున్నాయి. హరిహరకృష్ణ, నవీన్ ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
ఆ యువతి ప్రేమికుడితో దిగిన ఫొటోలను మరో యువకుడి ఫోన్ లోకి వెళ్లడం.. ప్రియుడు, యువకుడు ఇద్దరూ కలిసి బ్లాక్మెయిల్ చేయడంతో యువతి ఆదివారం బలవన్మరనానికి పాల్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముగ్ధుంపురం శివారులో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 22న తన కుమార్తె కనించడం లేదనిరక్షిత తండ్రి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రక్షిత ఆచూకీని కనుగొన్నారు. ఏ జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ప్రేమికుడితో దిగిన ఫొటోలు అతను మరో వ్యక్తికి పంపాడు.. ఇద్దరు కలిసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రక్షితకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
రక్షిత ఆదివారం వరంగల్లోని తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. రక్షితపై ర్యాగింగ్ పాల్పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది.
పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని తమ కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్ పొందిందని తెలిపింది. రెండేళ్లు కళాశాలలోనే చదివిందని.. కానీ బ్యాక్లాగ్లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్ అయిందని పేర్కొంది. రక్షిత ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదని తెలిపింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications