ప్రాణం తీసిన ఈత సరదా: బీటెక్ విద్యార్ధి మృతి
హైదరాబాద్: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట వద్ద ఉన్న ఓ క్వారీకుంటలో పడి బీటెక్ విద్యార్ధి చనిపోయాడు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
లాల్గడి మలక్ పేట గ్రామానికి చెందిన ఆల నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సైనికపురిలో నివాసముంటున్నాడు. అతని కుమారుడు అక్షిత్ రెడ్డి (20) పంజాబ్లోని లౌలి ప్రోపెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు.
15 రోజులు సెలవులు రావడంతో సైనిక్పురికి వచ్చాడు. గురువారం సాయంత్రం స్నేహితుడు రుషీల్ చక్రవర్తితో బొమ్మరాశి పేటకు చేరుకున్నారు. ఆ తర్వాత క్వారీకుంట వద్దకు చేరుకున్నారు. ఇంతలో స్నేహితుడు రుషీల్ చక్రవర్తి కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి అక్షిత్ కనిపించలేదు.

చక్రవర్తి అదే రోజు సాయంత్రం శామీర్ పేట పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. బట్టలు, సెల్ ఫోన్ లభించింది. నీటికుంటలో పడి మృతి చెంది ఉంటారని నిర్దారణకు వచ్చన పోలీసులు జీడిమెట్లకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం మధ్యాహ్నాం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. కొడుకు మృతితో నర్సింహారెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బంధువు కుమారుడు అక్షిత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండలంలోని బొమ్మరాశిపేట పరిధిలోని సంఘటన స్ధలానికి చేరుకుని చేపట్టిన చర్యలను పర్యవేక్షించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications