కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువ: వైద్యులు ఏం చెప్పారంటే.?
హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు సుమారు 35 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

85 శాతం మంది బ్లాక్ ఫంగస్ రోగులు వ్యాక్సిన్ తీసుకోనివారే
అంతేగాక, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిపై బ్లాక్ ఫంగస్ ప్రభావం కూడా తక్కువనే ఉంటోందని వైద్య నిపుణులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడి చేరిన రోగుల్లో 85 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని వైద్యులు తెలిపారు. 7 శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నవారు ఉన్నారు.
ఇప్పటికీ రోజుకు ఒకటి రెండు బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయని, ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో వీరి సంఖ్య బాగా తగ్గుపోయిందని వైద్యులు వెల్లడించారు. స్టెరాయిడ్స్ తీసుకోనప్పటికీ తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారిలోనూ బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మైకోసిస్ గుర్తించినట్లు తెలిపారు.

ముక్కు, కళ్లపైనే బ్లాక్ ఫంగస్ ప్రభావం ఎక్కువ..
బ్లాక్ ఫంగస్ సోకిన బాధితుల్లో ఎక్కువ మందికి ముక్కు, కళ్లు ప్రభావితమయ్యాయని ఆస్పత్రి సీనియర్ వైద్యులు తెలిపారు. 71 శాతం మందికి ఆక్సిజన్ థెరపీ, 56 శాతం మంది రోగులకు రెమిడిసివిర్, కార్టికోస్టెరాయిడ్లపై 84 శాతం, 44 శాతం మందికి దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్, 50 శాతం మందికి కొత్తగా డయాబెటిస్ సోకినవారున్నారని తెలిపారు. .

డయాబెటీస్ రోగులకే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు..
మనదేశంలో డయాబెటీస్ ఉన్న రోగులకే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని సీనియర్ వైద్యులు డాక్టర్ కిరణ్ తెలిపారు. కేరళ నుంచి సేకరించిన డేటా ప్రకారం ప్రతి నలుగురు డయాబెటీస్ పేషెంట్లలో ఒకరు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని తెలిపారు.
మూడో వంతు ప్రజలు మాత్రమే డయాబెటీస్ పరిస్థితిపై అవగాహన కలిగివున్నారని చెప్పారు. ఈ కారణంగానే ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బ్లాక్ఫంగ్ నుంచి సేఫ్..
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల తీసుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మనీష్ గుప్తా తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇతర సమస్యలు కూడా ఎదురుకాకుండా వ్యాక్సిన్లు పనిచేస్తాయన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications