శివగిరి క్షేత్రంపై క్షుద్రపూజలు పోలీసుల అదుపులో నిందితులు
ప్రపంచంలో సర్వం టెక్నాలజీమయం అయిపోయింది. జనం 5జీ స్పీడ్తో దూసుకుపోతున్నారు. మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టిన స్మార్ట్ యుగంలోనూ ఇంకా కొందరు మూఢ నమ్మకాలు పట్టుకు వేలాడుతున్నారు. అతీతశక్తులు సంపాదించేందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది.

శివగిరి క్షేత్రంపై మంటలు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శివగిరి క్షేత్రం. కాళీమాత నిలువెత్తు విగ్రహం కలిగిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మూడురోజులుగా క్షుద్రపూజలకు ఆలవాలంగా మారింది. అతీతశక్తుల కోసం ఓ వ్యక్తి నగ్నంగా పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.
ఆదివారం రాత్రి కరెంటు పోవడంతో బయటకు వచ్చిన స్థానికులకు శివగిరి క్షేత్రంపై పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటం కనిపించింది. అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించి కొండపైకి వెళ్లిన స్థానిక యువకులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు.

కాళీమాత ముందు క్షుద్రపూజలు
శివగిరి క్షేత్రంపై చుట్టూ మంట మండుతుండగా వాటి మధ్యలో ఒక వ్యక్తి నగ్నంగా కూర్చొని ఉన్నాడు. కాళీమాత ఆవాహన కోసం బిగ్గరగా మంత్రాలు జపిస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న మంటలు ఆరిపోకుండా మరో ఇద్దరు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షుద్రపూజ చేస్తున్న ప్రాంతంలో నిమ్మకాయలు, బలి ఇచ్చేందుకు తెచ్చిన పావురాలు, మేకలు, చేప పిల్లలతో పాటు బీర్ బాటిళ్లను స్థానికులు గుర్తించారు. మూడు రోజులుగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మాజీ ఆర్మీ జవాన్గా గుర్తింపు
క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను హైదరాబాద్కు చెందిన కమల్, భరత్, సురేష్, రాజుగా గుర్తించారు. వీరిలో నగ్నంగా పూజలు చేసిన వ్యక్తి మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ అని, అమ్మవారి సేవ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దివ్యశక్తి పెంచుకునేందుకే తప్ప తన పూజల వల్ల ఎవరికీ కీడు కలగదని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications