గీత భర్త ఇష్యూ: 'తలసాని కొడుకుతో కలిసి సెటిల్ చేసుకున్నాం'
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో కలకలం రేపిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావు విషయమై బిల్డర్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. తామంతా నిన్న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తాజ్ హోటల్లో ఉన్నామని చెప్పారు.
బిజినెస్ వ్యవహారంలో భాగంగానే తాను రామకోటేశ్వర రావును కలిసినట్లు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుతో పాటు మరో ఇద్దరితో కలిసి సెటిల్ చేసుకున్నామని చెప్పారు. మాకు రామకోటేశ్వర రావు ఇవ్వాల్సిన రూ.13 కోట్లు ఇవ్వలేమని చెప్పారన్నారు.

దీంతో తాము రూ.5కోట్ల ఆస్తి పత్రాలు, లిఖిత పూర్వకంగా రాయించుకున్నామని చెప్పారు. తాను మద్యం తాగి ఉన్నానని చెప్పి తనను రామకోటేశ్వర రావు కొండాపూర్లో దించి వెళ్లారని చెప్పారు. తలసాని తనయుడు తమ కంటే ముందే పది గంటలకు వెళ్లిపోయారని చెప్పారు.
తలసాని సాయి యాదవ్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు
అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుపై బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై తలసాని సాయి పైన కేసు నమోదైంది. రామకోటేశ్వర రావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు సాయి యాదవ్ పైన ఐపీసీ సెక్షన్లు 384, 342 కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తన కొడుకు తప్పేమీ లేదని, అసలు రామకోటేశ్వర రావుపై తన కొడుకు బెదిరింపులకు పాల్పడలేదని మంత్రి తలసాని వివరణ ఇచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications