ఓటుకు నోటులో దూకుడు: ఎసిబి ముందుకు 4గురు టిడిపి యువనేతలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మలుపులు తిరుగుతోంది. సిఆర్పీసి 160 కింద ఎసిబి ఎదుట హాజరు కావాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం నాడు ఉదయం టిఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రదీప్, సుధీర్, మనోజ్, పుల్లారావు యాదవ్లు ఎసిబి ఎదుట హాజరయ్యారు.
వారితో పాటు రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డి కూడా ఎసిబి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయలేదని, కావాలనే కుట్రలో భాగంగా ఇరికించారని ఆరోపించారు. ఎసిబి విచారణకు సహకరిస్తామని చెప్పారు.
కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత టిఎన్ఎస్ఎఫ్ నేతలుక నోటీసులు ఇచ్చింది.