వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటులో దూకుడు: ఎసిబి ముందుకు 4గురు టిడిపి యువనేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మలుపులు తిరుగుతోంది. సిఆర్పీసి 160 కింద ఎసిబి ఎదుట హాజరు కావాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం నాడు ఉదయం టిఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రదీప్, సుధీర్, మనోజ్, పుల్లారావు యాదవ్‌లు ఎసిబి ఎదుట హాజరయ్యారు.

వారితో పాటు రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డి కూడా ఎసిబి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయలేదని, కావాలనే కుట్రలో భాగంగా ఇరికించారని ఆరోపించారు. ఎసిబి విచారణకు సహకరిస్తామని చెప్పారు.

Revanth Reddy

కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత టిఎన్ఎస్ఎఫ్ నేతలుక నోటీసులు ఇచ్చింది.

English summary
Cash for Vote: Four TDP leaders before ACB
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X