గవర్నర్, తలసానిని తొలగించండి: కేంద్రానికి మర్రి శశిధర్ లేఖ
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని మర్రి శశిధర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు బాధ్యులైన గవర్నర్ నరసింహన్ను తప్పించాలంటూ మూడు రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.
మంత్రి తలసానిని గవర్నర్ బర్తరఫ్ చేయకపోవడం విధులను సరిగా నిర్వహించకపోవడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నరసింహన్ ను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.

తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని టిఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని.. విధుల్లో విఫలమైన గవర్నర్ను తప్పించాలని పేర్కొన్నారు. తలసాని విషయంలో మొదట తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అనుకున్నా.. కీలక పాత్ర గవర్నర్దేనని అన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా గవర్నర్ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని గవర్నర్ ఉల్లంఘించారని అన్నారు. గవర్నర్ను తొలగించాలని రాష్ట్రపతిని కూడా కోరతానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తలసానిని కూడా వెంటనే తొలగించాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications