CM KCR: యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఎప్పుడంటే..
సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వెళ్లనున్నారు. కేసీఆర్ అతి త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జాతీయ పార్టీ ప్రకటించే ముందు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. దసరా రోజున జాతీయ పార్టీ గురించి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 5వ
అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ఎల్పీతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ నేతలకు ఆహ్వానం..!
జాతీయ పార్టీ కో ఆర్డినేటర్లను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దసరా రోజున పలు పార్టీల జాతీయ నేతలను కూడా కేసీఆర్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కోసం సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లారు. శుక్రవారం రోడ్డు మార్గన కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications