పదవులు రాకుంటే..: కెసిఆర్ బుజ్జగింపు, హరీష్ పేరు ప్రస్తావన
ఖమ్మం: పదవులు రాని వారు అసంతృప్తికి గురి కావొద్దని, వేచి చూడాలని, పార్టీ కోసం పని చేయాలని, సమయం వచ్చినప్పుడు అందరికీ పదవులు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం జిల్లా పార్టీ ప్లీనరీలో బుధవారం అన్నారు. మిషన్ కాకతీయను ప్రస్తావించి మంత్రి హరీష్ రావు దూసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఓ సందర్భంలో మంత్రి పదవి తనను వెతుక్కుంటూ వచ్చిందన్నారు. సమయాన్ని బట్టి అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. తెలివైన రాజకీయా నాయకులు పదవుల కోసం వేచి చూడాలని, అదే పార్టీ విధేయత అన్నారు. పదవులు రానంత మాత్రాన మనసు చిన్నబుచ్చుకోవద్దన్నారు.
మన శాసన సభ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశముందని, అప్పుడు ఎమ్మెల్సీలు కూడా పెరుగుతాయని చెప్పారు. రాకున్నా నాయకులు పార్టీ కోసం పని చేస్తూ వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ ఎంపీ అవుతారని ఎవరూ ఊహించలేదని, అది అవకాశాలు వస్తాయనేందుకు నిదర్శనమన్నారు.
హైదరాబాద్ మేయర్గా బొంతు రామ్మోహన్ కూడా నాడు విద్యార్థి నాయకుడు అని, ఆయన మేయర్ అవుతాడని ఎవరూ ఊహించలేదన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కూడా పార్టీ కోసం పని చేసి, పదవులు పొందారని అభిప్రాయపడ్డారు.
పార్టీ, ప్రభుత్వం జోడు గుర్రాల్లా పరుగెత్తాలన్నారు. వేలాది మార్కెటింగ్ కమిటీ పదవులు రానున్నాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి తన గెలుపు కోసం బాగా కృషి చేశారని, ఆ తర్వాత తాను రాజీనామా చేసినప్పుడు ఆయనకు ఎంపీగా అవకాశమిచ్చానని చెప్పారు. వేచి చూస్తే పదవులు వస్తాయన్నారు.
ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లో విశ్రాంతి తీసుకుంటే అప్పుడే అతని పతనం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు ఇప్పుడు మనకు అద్భుతమైన మెజార్టీని కట్టబెడుతున్నారని, వారు మనల్ని ఆదరిస్తున్నారని చెప్పి ఊరుకోవద్దన్నారు.
ప్రజలు అప్పుడప్పుడు అద్భుతమైన తీర్పులు ఇస్తారని, ప్రజలను పట్టించుకోకుంటే వారు మనలను బండకేసి కొడతారని చెప్పారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా మనం చాలా వాటిని అమలు చేస్తున్నామన్నారు. మంచి పనులు అనుకుంటే మేనిఫెస్టోలో పెట్టకపోయినా చేస్తున్నామన్నారు.

హరీష్ రావు పేరు ప్రస్తావన
తెలంగాణ ఉద్యమం లక్ష్యమే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నారు. నిధులు, ఉద్యోగాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయని చెప్పారు. ఇక మనకు మిగిలిన లక్ష్యం నీరు అన్నారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మిషన్ కాకతీయ కోసం కష్టపడుతున్నామన్నారు. తాగునీటి సమస్య శాశ్వత నివారణ కోసం మిషన్ భగీరథ అన్నారు.
కొన్ని వార్తలు చూస్తే బాధ వేస్తోందని, కళ్యాణ లక్ష్మి పెట్టినా, షాదీ ముబారక్ పెట్టినా కొన్ని పందికొక్కులు దూరి.. వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వీటి పట్ల తెరాస కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతంలో కొందరు నేతలు తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని చెప్పారని, కానీ వారి మాటలు అవాస్తవం అయ్యాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మన మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications