చేసిందేమీ లేదు: డిఎస్పై భగ్గుమన్న ఆకుల లలిత
నిజామాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్పై కాంగ్రెసు ఎమ్మెల్సీ ఆకుల లలిత భగ్గుమన్నారు. డి. శ్రీనివాస్ తమకు చేసిందేమీ లేదని ఆమె అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పిసిసి అధ్యక్షుడు ఇప్పించారని ఆమె చెప్పారు.
బలహీనవర్గాలకు న్యాయం చేశామని అంటున్న డి. శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎంత మందిని పైకి తెచ్చారో చెప్పాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా డిఎస్ చేసారని, తాను డిఎస్ శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని ఆమె చెప్పారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేశారనే అభిప్రాయంపై ఆమె ఆ విధంగా అన్నారు.
తనను సంప్రదించకుండానే ఆకుల లలిత పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేశారని డిఎస్ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేస్తారని డిఎస్ ఆశించారు. అయితే, ఆయనను కాదని కాంగ్రెసు నాయకత్వం ఎమ్మెల్సీ పదవికి ఆకుల లలిత పేరను ఖరారు చేసింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications