నయీం కేసులో ప్రముఖులకు నోటీసులు! లిస్ట్ నుంచి వారిని తప్పించారు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాఫ్తు కీలక ఘట్టానికి చేరుకుంటోంది. నయీం కేసు దర్యాఫ్తు చేస్తున్న సిట్ మరికొందరు ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే నయీంతో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు తాఖీదులు ఇవ్వనుంది.
నయీం అరాచకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ముఖ్యమైన వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సిట్.. అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు లభించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు డిజిపి అనురాగ్ శర్మ నివేదిక అందించారు.
భూకబ్జాలకు, బెదిరింపులకు ఎవరెవరు సహకరించారో, ఎలా సహకరించారో నయీం తన డైరీలో రాసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఓ ఎమ్మెల్సీ, నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని సిట్ యోచిస్తోందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వారికి సంకేతాలు కూడా అందాయట.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొందరు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదిత లిస్టులో అర్హతలున్నప్పటికి ఒకరిద్దరు అధికారులను పక్కన పెట్టారని అంటున్నారు. అందుకు నయీం కేసే కారణమని అంటున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications