Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఊపందుకున్న దశాబ్ది ఉత్సవాలు.!తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్న కవిత.!

నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనన్ని అభివృద్ది సంక్షేమ పనులను సీఎం చంద్రశేఖర్ రావు చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.

మంచి పనులే కేసీఆర్ చేశారు : ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడారు.ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు గులాబీ పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ న్యూస్ ఛానల్ ను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు పత్రికను చదివేలా, టీ న్యూస్ ఛానల్ ను చూసేలా ప్రోత్సహించాలని, అందులో వచ్చే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు కవిత. మండల స్థాయిలో గ్రామస్థాయిలో అధ్యక్షులు చొరువ తీసుకుని టీ న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయించాలని కవిత పిలుపునిచ్చారు.

 kavitha
ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీని హేళన చేసారు : ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. "మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతీ పథకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేధం... చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం ... ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండలాగా తరతరలాకు ఆదుకునే ప్రాజెక్టు అని ఉద్ఘాటించారు కవిత.

 kavitha
జయశంకర్ సర్ స్పూర్తితో ముందడుగు : రెండు దశాబ్దాల నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితమయ్యారని కొనియాడారు. తమ పార్టీ విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి ఉద్దేశమని, మనకు పదవులు రావడం అన్నది రెండో ఉద్దేశమని అన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సర్ స్పూర్తిని తీసుకొని ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, ఇటువంటి పార్టీలో ప్రతీ ఒక్కరికి అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని స్పష్టం చేశారు.

 kavitha
నిజామాబాద్ లో ఈఎస్ఐ ఆస్పత్రి : లక్షా 33 వేల మంది బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు కవిత. ఈ ఆస్పత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని కవిత చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+