నోట్ల రద్దు: శనివారం వృద్ధులకే స్పెషల్, 2 రోజులు మార్పిడికి అవకాశం లేనట్లే!
రేపు అనగా, శనివారం నాడు దేశంలోని అన్ని బ్యాంకులలోను కేవలం వృద్ధులకే నగదు మార్పిడికి అవకాశం కల్పించనున్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి నేపథ్యంల ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వృద్ధుల కోసం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. రేపు (శనివారం) నాడు అన్ని బ్యాంకులలోను నోట్ల మార్పిడిని కేవలం వృద్ధులకే కేటాయించనున్నారు.
రేపు ఒక్కరోజు దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ పెద్ద నోట్లను మార్చుకునేందుకు, ఇతర లావాదేవీలను నిర్వహించుకునేలా బ్యాంకులు అవకాశం కల్పించాయి. బ్యాంకు లావాదేవీలు, నగదు మార్పిడికి కేవలం వృద్ధులను మాత్రమే అనుమతిస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు దినం కావడంతో వరుసగా రెండు రోజుల నోట్ల మార్పిడికి అవకాశం లేనట్లే.

ఓ విధంగా శనివారం అన్ని బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసారనే చెప్పవచ్చు. వృద్ధులకు మినహాయింపునిచ్చారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ రాజీవ్ రుషి వెల్లడించారు.
అయితే, మిగిలిన అన్నీ లావాదేవీలు యథావిధిగా నడుస్తాయని, రేపు బ్యాంకులు తమ పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటాయన్నారు. నగదు మార్పిడి కోసం వస్తున్నవారికి సిరా చుక్కపెట్టడం వల్ల బ్యాంకుల్లో రద్దీ దాదాపు నలభై శాతం మేర తగ్గిందన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications