పార్టీ చరిత్ర చూడండి, వారిని నమ్మొద్దు: మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి ప్రచారం
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. శుక్రవారం ఆర్మూర్, ముథోల్, కోరుట్లలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్మూర్ సభలో మాట్లాడుతూ.. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం.. బహుషా ఈ ప్రపంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికలు వస్తాయి పోతాయి.. పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే. ఇక్కడ రైతాంగం అధికంగా ఉంటది. పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం. బహుషా అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అంతమంచి అభ్యుదయమైన రైతులు. అంకాపూర్ రైతుల చైతన్యంతో, వారిని స్ఫూర్తిగా తీసుకొని వందలాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు.

ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడుతుందని కేసీఆర్ అన్నారు. ఇది ఆర్మూరు జనమా.. ప్రభంజనమా.. అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆర్మూర్లో ఒక విషయం అయితే తేలిపోయింది. ఈ సభ సముద్రాన్ని చూసిన తర్వాత జీనవ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతారని స్పష్టంగా తేలిపోయింది. జీవన్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణ ఉద్యమంలో ఉండి.. ఎర్ర జొన్న రైతులకు కోసం ఆరమణ దీక్ష చేశారు. ఫైరింగ్ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలీసు కాల్పులు జరిపింది. నేను ఎక్కడ్నో కరీంనగర్ పర్యటనలో ఉన్నాను. ఇక్కడ కాల్పులు జరిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్కు వచ్చాను. అప్పట్నుంచి నాకు సన్నిహితుడై కుటుంబంలో ఓ సభ్యుడిగలా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు జీవన్ రెడ్డి అని తెలిపారు. ఇతర పార్టీల చెప్పేవన్నీ నమ్మకండి. ప్రజల కోసం పని చేసే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం పాటు పడే వ్యక్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
— BRS Party (@BRSparty) November 3, 2023
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, వారి అభివృద్ధి కోసం ప్రజల మధ్య ఉండి పనిచేసే జీవన్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.… pic.twitter.com/UUrsWLx54O
పార్టీ చరిత్ర ఆలోచించి ఓటేయండి
మరోవైపు, ముథోల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు. 30న ఓట్లు వేస్తరు. 3న లెక్క అయిపోతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. అది తప్పదు అని కేసీఆర్ అన్నారు.
ముధోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
— BRS Party (@BRSparty) November 3, 2023
మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా.. ఎందంటే.. ఎన్నికల్లో ఒక వ్య… pic.twitter.com/rAe6yONFcs
కానీ మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా.. ఎందంటే.. ఎన్నికల్లో ఒక వ్యక్తి నిలబడుతాడు. మంచి, చెడు, అతని గుణగణాలు ఆలోచించాలన్నారు కేసీఆర్.
అంతే కాకుండా ఆ వ్యక్తి వెనుకాల ఏ పార్టీ ఉంది. పార్టీకి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఏందో మీకు తెలుసు. ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇవన్నీ మీరు విచారించి ఓటు వేయాలి. అలాంటప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతంది. విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉంటే వజ్రాయుధం ఓటు. సరైన పార్టీకి ఓటేస్తేనే భవిష్యత్ సరైన పద్ధతిలో ఉంటుంది. లేదంటే వచ్చే ఐదేండ్లు బాధపడాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేయాలి అని కేసీఆర్ కోరారు.
ఆ పార్టీల మాటలు నమ్మకండి
కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. కోరుట్ల సభలో ఆయన మాట్లాడుతూ.. .. 'దేశంలో పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మళ్లీ మరోపార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు. రైతులు, ప్రజల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ గారికి మద్దతుగా బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
— BRS Party (@BRSparty) November 3, 2023
సంజయ్ మంచి వైద్యుడు. ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా… pic.twitter.com/NrRuyXHHyK
రెండు సార్లు రుణమాఫీ చేశామని కేసీఆర్ తెలిపారు. రైతుల భూములు ఆక్రమణలకు గురికాకుండా ధరణి తీసుకొచ్చినమని చెప్పారు. ధరణి వల్లనే రైతుబంధు వస్తున్నది. రైతు బీమా వస్తున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు. రైతు బీమా ఇవ్వడం కుదరదు. రాహుల్గాంధీ సహా కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తం అంటున్నరు. ధరణిని కాదు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి' అని సీఎం అన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులను ఆదుకుంటామని చెప్పారు.
కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తం. కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు. సంజయ్ మంచి వైద్యుడు. ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా గడ్డకు సేవ చేసుకుంటా అనే సంకల్పంతో పోటీకి సిద్ధమైండు. నేను నిరాహార దీక్ష చేసిన సమయంలో డాక్టర్ సంజయ్ నన్ను దగ్గురుండి చూసుకున్నడు. నా ప్రాణాలు కాపాడిండు. డాక్టర్ సంజయ్ నాకు బిడ్డ లాంటి వాడు అని కేసీఆర్ పేర్కొన్నారు. డాక్టర్ సంజయ్ స్థానిక బిడ్డ. ఆయనను మీరంతా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలి' అని సీఎం కేసీఆర్ కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications