బీఆర్ఎస్కు ఎన్నికల సంఘం నుంచి గుడ్న్యూస్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS)కు ఎన్నికల సంఘం నుంచి మంచి వార్త అందింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలివున్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించింది. దీంతో ఓటర్లు గందరగోళానికి గురై.. కారు గుర్తుకు బదులు వేరే గుర్తులకు ఓటు వేసినట్లు గతంలో పెద్ద చర్చ జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను కలిసింది. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు 8 ఉన్నాయని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వికాస్ రాజ్కు ఓ వినతి పత్రాన్ని కూడా అందజేసింది. ఈ నేపథ్యంలోనే కారును పోలివున్న గుర్తులను ఎన్నికల సంఘం తొలగించింది.

ఇది ఇలావుండగా, దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైసీపీ), తెలుగుదేశం పార్టీలున్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్తో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్సార్టీపీ ) పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నాలుగు పార్టీల చిరునామాలు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి అతీతంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్ను విడుదల చేసింది. ఆటోరిక్షా, హ్యాట్, ఇస్ట్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇవ్వడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇవి కారు గుర్తును పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రాల జాబితా నుంచి మినహాయించింది.
జాతీయ పార్టీల జాబితాలో ఆప్, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసు(Tea glass) గుర్తును ఫ్రీ సింబల్స్ తాజాగా, జాబితాలో చేర్చడం గమనార్హం.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications