రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ ఉద్యోగాలను క్రమబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 22వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగుతున్నారు.
మంగళవారం ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్లో జరిగిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ బహిరంగ సభలో ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయం ప్రకటించారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచే సమ్మె ప్రారంభం అవుతుందని జెఏసీ నేత సాయిలు చెప్పారు.
అన్ని యూనియన్ల నాయకుల సహకారంతో ముందుకు వెళుతున్నామని, ఐకమత్యంతో విజయం సాధించే వరకు పోరాడతామన్నారు. ఉద్యోగులు, కార్మికులు శాంతియుతంగా సమ్మెలో పాల్గోని, ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా సమ్మె చేయాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్ట్ వ్యవస్ద రద్దుయినప్పుడే విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు గౌరవంగా జీవించగలుగుతారని సభలో పాల్గొన్న ప్రోపెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ వ్వవస్దను రద్దు చేసి , ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ తోపాటు అన్ని పార్టీలు హామీలు ఇచ్చిన విషయాన్నిహరగోపాల్ గుర్తు చేశారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ ఉద్యోగాలను క్రమబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 22వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగుతున్నారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
మంగళవారం ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్లో జరిగిన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ బహిరంగ సభలో ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయం ప్రకటించారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచే సమ్మె ప్రారంభం అవుతుందని జెఏసీ నేత సాయిలు చెప్పారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
అన్ని యూనియన్ల నాయకుల సహకారంతో ముందుకు వెళుతున్నామని, ఐకమత్యంతో విజయం సాధించే వరకు పోరాడతామన్నారు. ఉద్యోగులు, కార్మికులు శాంతియుతంగా సమ్మెలో పాల్గోని, ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా సమ్మె చేయాలని పిలుపునిచ్చారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సభలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్స్కు కరెంట్ కట్ చేస్తే ప్రభుత్వమే దిగి వస్తుందని అన్నారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
చట్టపరంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని, 250 రోజులు పనిచేసిన వారికి న్యాయం చేయాలని కోర్టులు చెబుతున్నాయని అన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు.

రేపటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
విద్యుత్ కార్మికులకు 10 శాతం ఐఆర్ ఇస్తామన్న యాజమాన్యం మాట తప్పిందని సీఐటీయూ నేత ఈశ్వర్ రావు అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కమిటీ వేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేదన్నారు.
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సభలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్స్కు కరెంట్ కట్ చేస్తే ప్రభుత్వమే దిగి వస్తుందని అన్నారు.
చట్టపరంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని, 250 రోజులు పనిచేసిన వారికి న్యాయం చేయాలని కోర్టులు చెబుతున్నాయని అన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు.
గాలిలో దీపాలుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న విద్యుత్ కార్మికులు చనిపోయినా వారికి జరగడం లేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని మాటిచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కృష్ణయ్య ప్రశ్నించారు.
విద్యుత్ కార్మికులకు 10 శాతం ఐఆర్ ఇస్తామన్న యాజమాన్యం మాట తప్పిందని సీఐటీయూ నేత ఈశ్వర్ రావు అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కమిటీ వేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేదన్నారు. తమిళనాడు తరహాలోనే చదువు, వయసుతో నిమిత్తం లేకుండా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications