రెండో భార్యతో కలిసి తండ్రి కూతురికి వాతలు: నలుగురి కిడ్నాప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలోని ఎల్బీనగర్లో కూతురి పట్ల ఓ ఉన్నతాధికారి అత్యంత ఘాతుకానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. చిన్నారిని తండ్రే చిత్రహింసలకు గురి చేశాడు. ఆరేళ్ల చిన్నారిని సొంత తండ్రి రమేష్, సవతి తల్లి శ్యామల చిత్రహింసలకు గురిచేశారు.
బాలిక వంటి నిండా వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం పోలీసుల సాయంతో బాలికను చెర నుంచి విడిపించారు. పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకోగా రమేష్ పరారీలో ఉన్నాడు. రమేష్ టెలికాంశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.
సికింద్రాబాదు నగరంలోని చిలకలగూడలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్కు గురైయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గడిచిన రాత్రి క్రైం బ్రాంచ్ పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు అంజలి, లక్ష్మీ, నర్సింహారావు, శ్రవణ్లను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల పేరు చెప్పి వారిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఓ చీటింగ్ కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. కాగా పోలీసుల ముసుగులో కొందరు దుండగులు కిడ్నాప్ కు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నేడు 350 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రయణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారులు ఈ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications