షాకింగ్: చేపల కోసం వల వేస్తే భారీ కొండ చిలువ పడింది, ఆందోళన
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో చేపల కోసం వేసిన వలలో ఓ కొండ చిలువ పడింది. ఈ సంఘటన బుధవారం నాడు కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. చేపల వేటకోసం వేసిన వలలో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ చిక్కింది.
నాయకన్ గూడెం గ్రామానికి చెందిన షేక్ మన్సూర్ పాలేరు జలాశయంలో చేపల వేటకు గానూ ప్రతీరోజు మాదిరిగానే మంగళవారం రాత్రి వల వేసి పెట్టాడు. బుధవారం ఉదయం వెళ్లి వలలో చిక్కిన చేపలకోసం పరిశీలిస్తుండగా వల భారీగా కన్పించింది.

సమీపంలోని తోటి మత్స్యకారులను పిలిచి వలను జలాశయం ఒడ్డుకు లాగడంతో అందులో మృతి చెందిన కొండ చిలువ కనిపించింది. దీంతో జలాశయం ఒడ్డుకు చేర్చాడు. గత అయిదేళ్ల క్రితం ఇదే జలాశయంలో నల్గొండ జిల్లా బోడబండ్లగూడెం గ్రామానికి చెందిన షేక్ సోందుకు కూడా ఇదే విధంగా కొండచిలువ చిక్కింది. జలాశయంలో కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications