బలవంతంగా తాళి కట్టి ఫేస్బుక్లో ఫోటోలు పోస్ట్ చేశాడు, అమ్మాయి ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు బలవంతంగా మైనర్ బాలిక భవానీ (17) మెడలో తాళి కట్టి దానిని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇది తెలిసిన ఆ బాలిక అవమానంతో ఆత్మహత్య చేసుకుంది.
బాలిక మృతితో కుటుంబంలో విషాధఛాయలు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడిని బాబుగా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
నిందితుడు గత కొంతకాలంగా ఆమెను ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు బలవంతంగా తాళి కట్టి ఫోటోలు పోస్టు చేశాడు. వాటిని చూసిన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అమ్మాయిని అడిగారు. మందలించారు.
అతను బలవంతంగా తన మెడలో తాళి కట్టాడని చెప్పిన ఆ బాలిక ఆ తర్వాత బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.