విషాదం:పెళ్ళైన గంటల్లోనే వధువు మృతి,ఏమైందంటే?
సూర్యాపేట: పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది.వివాహం సందర్భంగా వధూవరులను ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది. వివాహమైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హన్మయ్య, పుష్పలతల కూతురు గాయత్రికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం నాడు వివాహం చేశారు.

సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో వివాహం చేశారు. వివాహమైన తర్వాత బంధు మిత్రులను నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువును అత్తారింటికి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
సంప్రదాయం ప్రకారంగా నూతన వధూవరులను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్ళారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుండి బయటకు రాగానే నూతన వధువు గాయత్రి కుప్పకూలింది. హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు గాయత్రి మృతి చెందిందని ప్రకటించారు.పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మరణించడంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. గాయత్రి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications