విషాదం:పెళ్ళైన గంటల్లోనే వధువు మృతి,ఏమైందంటే?
సూర్యాపేట: పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది.వివాహం సందర్భంగా వధూవరులను ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది. వివాహమైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హన్మయ్య, పుష్పలతల కూతురు గాయత్రికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం నాడు వివాహం చేశారు.

సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో వివాహం చేశారు. వివాహమైన తర్వాత బంధు మిత్రులను నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువును అత్తారింటికి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
సంప్రదాయం ప్రకారంగా నూతన వధూవరులను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్ళారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుండి బయటకు రాగానే నూతన వధువు గాయత్రి కుప్పకూలింది. హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు గాయత్రి మృతి చెందిందని ప్రకటించారు.పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మరణించడంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. గాయత్రి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications