భేటీ: ఘంటా చక్రపాణి టీమ్కు గవర్నర్ ప్రశంసల జల్లు
హైదరాబాద్: ఘంటా చక్రపాణి చైర్మన్గా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ)పై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్లో కూడా కమిషన్ ఇదేవిధంగా అత్యున్నత పనితీరును కొనసాగిస్తూ తెలంగాణలోని నిరుద్యోగుల ఆకాంక్షలకు తగినట్లు వ్యవహరించాలని గవర్నర్ సూచించారని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
గవర్నర్ను రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు కమిషన్ సభ్యులు కలిశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు, కమిషన్ చేపట్టిన వినూత్న విధానాలను వివరించినట్లు కమిషన్ తెలిపింది.

టీఎస్పీఎస్సీ నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ పరీక్ష విధానంపై గవర్నర్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని, ఆన్లైన్ పరీక్షా విధానం, ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఉద్యోగార్థుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తున్నట్లు సమావేశంలో గవర్నర్కు టీఎస్పీఎస్సీ సభ్యులు తెలిపారు.
ఇప్పటివరకు నిర్వహించిన ఏడు ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో ఐదింటిని ఆన్లైన్ విధానంలోనే నిర్వహించినట్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని కమిషన్ తెలిపింది. కమిషన్ ఏర్పాటైన స్వల్పకాలంలోనే వినూత్నమైన విధానాలు, పారదర్శకంగా పరీక్షల నిర్వహణతో దేశంలోని మిగతా కమిషన్లకు ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ ప్రశంసించారు అని భేటీ వివరాలను టీఎస్పీఎస్సీ.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications