విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో
తుపాకులు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కిరణ్ కుమార్ అనే కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన ఎస్సై, తోటి కానిస్టేబుళ్లు హుటాహుటిన గాయపడ్డ కానిస్టేబుల్ను 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటపల్లికి చెందిన కిరణ్ కిరణ్ కుమార్.. 132వ బెటాలియన్ బీ కంపెనీలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, గత ఐదు నెలలుగా తిర్యానీ పోలీస్ స్టేషన్లోనే కిరణ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిరణ్ కుమార్ మృతితో అతని కుటుంబంతోపాటు చౌటపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications